telugu navyamedia
Uncategorized

ఒకేసారి లైట్లు ఆఫ్ చేస్తే.. ఎలాంటి ప్రభావం చూపదు: సీఎండీ ప్రభాకరరావు

Transco md prahakar Rao

దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్‌ చేయడం వల్ల పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందని కొన్ని రాష్ట్రాల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు స్పందించారు.

ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ గ్రిడ్‌ కుప్పకూలే సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించాలని అన్నారు. తెలంగాణ వరకు గ్రిడ్‌కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు.

Related posts