కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాక నుంచి రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇది వినిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడు గల కారణాలపై అన్వేషించారు. పశువుల పాకలోని యూరియా బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలను నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుట్రలు చేయొద్దని కేసీఆర్కు నటుడు శివాజీ విజ్ఞప్తి