ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది
కాగా.. ఏ రూట్లలో ఎంత వరకూ బస్సు ఛార్జీ తగ్గించాలనే నిర్ణయం ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు అప్పగించినట్లు వెల్లడించింది. ఈనేపథ్యంలో ఛార్జీల తగ్గింపుపై ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.
విజయవాడ-హైదరాబాద్ మార్గంలో తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్ ధరలో 10 శాతం మేర తగ్గించినట్టు అధికారులు తెలిపారు.
విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ , విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించినట్లు ప్రకటించారు.
శుక్రవారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఛార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
బస్సుల్లో తగ్గించిన ఛార్జీల వివరాలివే..
*అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు
*విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం తగ్గింపు
* హైదరాబాద్-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు
*విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు.