telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ కు 6-లేన్ల ఎక్స్‌టర్నల్ మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం: మంత్రి నితిన్ గడ్కరీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు రూ. 573.77 కోట్ల వ్యయంతో 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా, జాతీయ రహదారి-216లోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ మీదుగా జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216 కూడలి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఈ 6-లేన్ల రహదారిని నిర్మించనున్నారు.

దీనివల్ల జాతీయ రహదారుల కారిడార్ నుంచి పోర్టుకు నేరుగా, వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని గడ్కరీ తెలిపారు.

ఈ రహదారి నిర్మాణంతో సరుకు రవాణా వాహనాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆమోదం పొందిన ప్రాజెక్టులో 6-లేన్ల ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు, ఒక ఓవర్‌పాస్ కమ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB) నిర్మాణం కూడా ఉన్నట్లు కేంద్రమంత్రి వివరించారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నం పోర్టు లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts