telugu navyamedia
Uncategorized

పోలవరం పై జగన్ ప్రశ్నలు.. ఇబ్బందిపడ్డ అధికారులు!

jagan

ఏపీ సీఎం జగన్ ఈ రోజు పోలవరం ప్రాజక్టును సందర్శించారు.పోలవరం ప్రాజక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజక్టులో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రాజక్టు పనులు జరుగుతున్న తీరు పట్ల ముందే ఓ అవగాహనతో ఉన్న జగన్ పోలవరం డ్యామ్ అధికారులను ప్రాజక్టు పనుల పై ప్రశ్నించారు.

కాఫర్ డ్యామ్ కారణంగా నీరు స్పిల్ వే పైకి చేరుకుంటే ఏం చేస్తారు? నిర్మాణంలో ఉన్న కట్టడాలకు వరద నీరు ఆటంకం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వరద వచ్చేనాటికి కాఫర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటి? అంటూ వరుసబెట్టి ప్రశ్నలు సంధించారు. దాంతో, అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. దాంతో జగన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Related posts