telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోమటిరెడ్డి అందుకే పార్టీ మారుతున్నారు.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

T Congress boycott mlc elections

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ ఏ కారణంతో పార్టీని వీడుతున్నారో తనతో చెప్పారని ఉత్తమ్ తెలిపారు. పార్టీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతారని అన్నారు. ఏఐసీసీ సమావేశంలో రాజగోపాల్ అంశంపై మరోసారి చర్చిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ వ్యాఖ్యానించిన రాజగోపాల్ దాదాపుగా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గురువారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. వీరితో చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో బీజేపీ ఎంపీలు ఆయనను వెల్‌కమ్ టూ బీజేపీ అని కామెంట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజీపీ పావులు కదుపుతునట్టు తెలుస్తోంది. ఏపీ లో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా బీజీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు.

Related posts