ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఒంగోలు ఐఐఐటీ తాత్కాలిక క్యాంపస్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇడుపులపాయ, ఒంగోలు మధ్య విద్యార్థులు తిరగాల్సి వస్తోందని, ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు.
ఎమ్మెల్యే సింధూర రెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సభలో ప్రస్తావించారు. సరైన అనుమతులు లేకుండానే కొందరు కాలేజీలు పెడుతున్నారని ఎమ్మెల్యే బత్తుల ఆరోపించారు.
దీనిపై మంత్రి లోకేశ్ సమాధామిస్తూ.. అక్రమాలపై వివరాలు తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏయే కాలేజీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై తన దృష్టికి తీసుకురావాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.

