తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్షయపాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. కష్టపడి పనిచేస్తోన్న అక్షయపాత్ర సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్ను ఈ క్యాంటీన్లు అందించాయి. కరోనాపై పోరాడుతున్న నేపథ్యంలో ఈ క్యాంటీన్లు 65 లక్షల మందికిపైగా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందజేశాయి.
ఈ క్యాంటీన్లు ప్రతిరోజు వేలాదిమంది ఆకలిని తీరుస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.
అందుకే జగన్ ఢిల్లీలో ప్లేటు ఫిరాయించాడు: మంత్రి యనమల