telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆక్సిజన్‌ లేదంటే.. ఐపీఎల్ అవసరమా…?

ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై. అయితే ఈ మెగా టోర్నీ నిర్వహణ విషయంలో ఇతరుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, కానీ అందరు ఒకేలా ఆలోచిస్తారని మాత్రం అనుకోవడం లేదన్నాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఆండ్రూ టై లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ఇద్దరు ఆసీస్ ప్లేయర్స్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా ఇంటిదారి పట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆండ్రూ టై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసమేనా? అనే ప్రశ్న తనకు తట్టిందన్నాడు. ‘ఆటగాళ్ల భద్రతా కోణంలో ప్రస్తుతానికి మేమంతా సేఫ్‌‌గానే ఉన్నాం. ఇది ఇలానే కొనసాగుతుందా? అలాగే భారత్‌లో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకని కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వాలు వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తున్నాయి.?’అని ఆండ్రూ టై ప్రశ్నించాడు.

Related posts