*ఏపీలో త్వరలో ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు
*టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం
*ప్రవేట్ సంస్థల కంటే తక్కువ ధరకు నిర్వహించేలా ఏర్పాట్లు.
ఆంధ్ర ప్రదేశ్లో అతిత్వరలోనే పూర్తిగా ఆన్లైన్ సినిమా టిక్కెట్ల పొందే అవకాశం ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది ప్రభుత్వం.
ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.
టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం అందుతోంది. తక్కువ సర్వీస్ చార్జీలు తీసుకునేందుకు జస్ట్ టిక్కెట్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు.ఈ ప్రకారం జస్ట్ టిక్కెట్కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టికెట్ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పలికినట్టుగా అవుతుందని తెలిపాయి.
.
హైకోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల