“స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2” సినిమాతో బాలీవుడ్ అరంగేట్రమ్ చేస్తోంది బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురు అనన్య పాండే. ఇంకా ఆమె నటించిన మొదటి సినిమా విడుదల కాకముందే నటుడు వరుణ్ ధావన్ తో ప్రేమలో ఉన్నానని చెప్పి ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మొహమాటపడకుండా తనకు వరుణ్ ధావన్ అంటే ఇష్టమని, అతడిని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. వరుణ్ లో తనకు నచ్చే విషయం ఎనర్జీ అని, చాలా క్యూట్ గా ఉండడంతో పాటు.. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది. ఈ విషయం చెప్పడం పద్ధతో కాదో తనకు తెలియదని, ఈ విషయం అతడికి కూడా తెలుసునని తెలిపింది. మరోవైపు వరుణ్ అతడు తన చిన్ననాటి స్నేహితురాలు నటాషాని ఘాడంగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా అనన్య ఇలా చెప్పడంతో సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
previous post


వాళ్ళను చూసి ఆడవాళ్లు చెడిపోతున్నారు : శ్రీరెడ్డి