telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య… దుమారం రేపుతున్న మాజీ ముఖ్యమంత్రి భార్య కామెంట్స్

Amrutha-Fadnavis

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం భార్య చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మహారాష్ట్రను మొన్నటివరకు పాలించిన బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ఇప్పుడు ముంబైలో తీవ్ర కలకలం రేపుతోంది. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఎటూ తేల్చకపోవడం.. బీహార్ పోలీసులకు సహకరించకపోవడంపై అమృత ఫడ్నవీస్ మండిపడ్డారు. ‘ముంబై తన మానవత్వాన్ని కోల్పోయింది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య.. దానిపై ముంబై పోలీసుల వ్యవహార శైలి చూస్తే బతకడానికి ముంబై మహానగరం ఎంత మాత్రం సురక్షితం కాదనే అనుమానం కలుగుతోందని అమృత అన్నారు. ఇక్కడ అమాయక ప్రజలు.. ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’’ అని అమృత ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ సక్రమంగా దర్యాప్తు జరపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరికొందరిపై పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీబీఐ విచారణకు బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసింది.

Related posts