ప్రముఖ హాలీవుడ్ నటులు జానీ డెప్, ఆంబర్ హర్డ్ ల మధ్య వివాదం గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆంబర్ హర్డ్ మరోసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తన భర్తను టార్చర్ పెట్టానని ఒప్పేసుకున్నారు. కుండలు, ఇంట్లోని వంట సామాన్లతో తన భర్తపై దాడి చేశానని వెల్లడించారు. దాంతో జానీ డెప్ 50 మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలంటూ ఆంబర్పై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఒకప్పుడు ఆంబర్ డెప్పై తప్పుడు ఆరోపణలు చేయడంతో ఆయన నటించాల్సిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనపై ఆంబర్ ఆరోపణలే చేయడంతో డిస్నీ సంస్థ ఆయనకు ఫేమస్ జాక్ స్పారో పాత్రను ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ‘ఆక్వామ్యాన్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఇందులో ఆంబర్ కీలక పాత్రల నటించాల్సి ఉంది. ఈ సినిమాలో ఆంబర్ను తీసుకోకూడదని, న్యాయం అనేది సమానంగా ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య కొన్నేళ్లకే విభేదాలు వచ్చాయి. దాంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ఈ వివాదంలోనే తన భర్త తనను టార్చర్ చేశాడని, గొంతు నొక్కి చంపబోయాడని ఆరోపించారు ఆంబర్. అంతేకాదు ఇద్దరి మధ్య జరిగిన కొట్లాటలో డెప్ చేతి వేలికి గాయం అయితే, ఆ రక్తంతో అద్దంపై భయంకరమైనన సందేశాలు రాసేవాడని ఆరోపించారు.