telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అక్కడే ఉంచాలి.. అమెరికాలో ఆంధ్రుల విజ్ఞప్తి

amaravathi ap

ఆంద్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాజధానిగా అమరావతి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, అందువల్ల అక్కడే రాజధానిని కొనసాగించాలని కోరారు.

జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పలు దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ దేశంలో మన దేశ అత్యున్నత అధికారిని కూడా కలిసి తమ మనసులో మాట తెలియజేశారు. రాజధానిగా అమరావతికి ఉన్న అనుకూలతలను వివరించారు.

Related posts