telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పనీపాటా లేనివారే బిగ్ బాస్ కు… డబ్బు కోసమే… హీరోయిన్ వ్యాఖ్యలు

Payal-Rohatgi

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ ఇప్పుడు హిందీలోనే కాదు దక్షిణాది భాషల్లోనూ మంచి ప్రేక్షకాదరణను దక్కించుకుంది. తాజాగా బిగ్‌బాస్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గి. ‘‘అమీషా పటేల్, కోయినా మిత్రా, రష్మీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా.. ఇలాంటి వారికి ఎలాంటి పని దొరకడం లేదు. అందుకే డబ్బు కోసం బిగ్‌బాస్ 13లో పాల్గొన్నారు. కొందరైతే డబ్బు ఇవ్వకపోయినా ఫర్వాలేదు షోలో కనిపించి నలుగురి కళ్లలో పడితే చాలు అనుకుంటున్నారు. నేను బిగ్‌బాస్ సీజన్‌ 2లో పాల్గొన్నప్పుడు నాకు కూడా ఎలాంటి అవకాశాలు రాలేదు’’ అని తెలిపారు. సినిమా అవాకాశాలు లేక సతమతమవుతున్నవారికి పారితోషికం ఇచ్చి బిగ్‌బాస్ హౌజ్‌‌లోకి పంపించి వారి చేత ఆటాడిస్తారు. అయితే బిగ్‌బాస్ దక్షిణాదికి కొత్త. ఎందుకంటే ఇక్కడ ఈ షో ప్రసారం అయ్యి మూడేళ్లే అవుతోంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఏకంగా 13 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఐదో సీజన్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్‌బాస్ షో తర్వాత చిత్ర పరిశ్రమలో సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. వారికి కూడా సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఓరకంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌ కెరీర్‌ను ఏర్పరచుకోవడానికి ఓ అణువైన మార్గం అనే చెప్పాలి. తెలుగులో యాంకర్ శ్రీముఖి, నటి పునర్నవి భూపాలం, బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లకు కూడా ఇప్పుడు అవకాశాలు బాాగా పెరిగిపోయాయ్. మొన్నటి వరకు రాహుల్ సిప్లిగంజ్‌ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ అతను బిగ్‌బాస్ టైటిల్ గెలవగానే తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మారుమోగిపోయింది.

Related posts