ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. అంతకు ముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
సీయంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దానితో ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు.
అంబటి రాంబాబు కేసులలో పోలీసులు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు నమోదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 16 క్రిమినల్ ఫిర్యాదు లు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు అయన ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉంటే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని కాబట్టి కొంతకాలం రిమాండ్ లో ఉంచాలని కోరారు.
అలాగే మాజీ మంత్రి రాంబాబు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు ఉందని సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు చేసారని రిమాండ్ రిపోర్టులో నల్లపాడు పోలీసులు ప్రస్తావించారు .
రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ మంత్రి అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
అంబటిని అరెస్ట్ చేయని పక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే చాన్స్ ఉందన్న పోలీసులు 14 రోజుల రిమాండ్తో పాటు పోలీసు కస్టడీ కి సైతం అంబటి ని అప్పగించాలని కోరారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. అంబటి రాంబాబు ఉద్దేశ పూర్వకం గానే ముఖ్యమంత్రిఫై దుర్భాషలాడారని డానికి సంబందించిన వీడియో ను కోర్టులో ప్రెజెంట్ చేసారు.
అంబటి ఫై నమోదైన కేసులు రుజువైతే 7 ఏళ్ల పైన శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు రిమాండ్ విధించడం తో పాటు విచారణ కోసం తమ కస్టడీకి కూడా ఇవ్వాలని పోలీసులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు కోరారు.
తనపై నమకదైన కేసులు అరెస్ట్ ఫై అంబటి రాంబాబు కోర్టులో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన వయస్సు దృష్ట్యా రిమాండ్ వద్దని బెయిల్ ఇవ్వాలని కోరారు. 68 ఏళ్ల వయస్సు లో తనను అరెస్ట్ చేసి పోలీసులు టార్చర్ చేసినట్టు చెప్పారు.
తన అనారోగ్యం దృష్ట్యా మెడిసిన్ మాత్రం ఇంటినుండి తెచ్చుకోవడానికి అనుమతించారు.

