ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మరోమారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్న విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపైనే ఆమె ఏడ్చేశారు. పక్కనే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఊరడించినా ఆమె నిభాయించుకోలేకపోయారు. పొంగుకొస్తున్న కన్నీళ్లను అదుపు చేసుకోలేక పలుమార్లు రుమాలుతో కళ్లు తుడుచుకున్నారు.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.సమావేశం ప్రారంభంలో వేదికపై విజయసాయిరెడ్డి, బొత్స, పుష్పశ్రీవాణి, శ్రీనివాస్లతోపాటు పలువురు ముఖ్య నేతలను మాత్రమే వేదికపైకి పిలిచారు. దీంతో డిప్యూటీ సీఎం భర్త పరీక్షిత్ రాజు వేదిక కిందే కూర్చోవాల్సి వచ్చింది. మంత్రి కన్నీరుకు ఇదే కారణమని తెలుస్తోంది.
లోకేశ్ సరిగా మాట్లాడలేరు అందుకే ట్వీట్లు : అనిల్ కుమార్ యాదవ్