అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్ గా మారుతుంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ఆవిష్కృతం అవుతున్న తొలి క్వాంటం మిషన్ ఇది.
ఏఐ క్వాంటం రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతోనే వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నాం. టీసీఎస్ లో కూడా అంతర్గతంగా ఓ క్వాంటం హ్యాకథాన్ నిర్వహించాం. 50 ప్లస్ ప్రాజెక్టు ఏరియాస్ ను గుర్తించాం.
ఔషధాల ఆవిష్కరణ, విద్యుత్ ఉత్పాదన సహా వివిధ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ క్లౌడ్ సేవలు ఇవాల్టి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు పరిశోధకులకు వీటిని అందుబాటులో ఉంటుంది అని హారిక్ టీసీఎస్ ప్రతినిధి అన్నారు.

