బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు కలిసి అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. రూరల్ సీఐ అశోక్ కుమార్ కథనం మేరకు అమ్మాయి దొమ్మన్నబావి దగ్గర గల కనికిలి బావి దగ్గరికి ఈనెల 3వ తేది సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వెళ్లడం చూసి ఒక పథకం ప్రకారం వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని భయపెట్టి తరిమేసి, తరువాత ఆ అమ్మాయిని బెదిరించి ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు క్రూరంగా అత్యాచారం చేసినట్లు తెలిపారు.
అక్కడితో ఆగకుండా అత్యాచారం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో వీడియో అప్లోడ్ చేస్తామని, చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటిలో బాధపడుతూ భయపడుతూ ఉండటం గమనించిన ఆమె తల్లి గట్టిగా అడగటంతో జరిగింది చెప్పడం వలన ఆమె తల్లి అమ్మాయి కలిసి మాలమహానాడు నాయకులతో కలిసి ముదివేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ సుకుమార్ తో కలిసి కేసు నమోదు చేసి అదేరోజు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.