స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ . పుష్ప షూటింగ్ ప్రస్తుతం రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇందులో పాల్గొనేందుకు వెళ్తూ కాకినాడ వచ్చిన ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారు.
సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అడువుల్లో జరిగింది.
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది.