తెలుగులో తొలి పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కి అపూర్వ విజయం సాధించిన ‘మగధీర ‘ విడుదలై నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెగా పవర్ స్టార్ రాంచరణ్ మగధీరపై ఒక స్పెషల్ వీడియో ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మూవీ టీమ్ కు, మంచి విజయాన్ని ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. చిత్ర దర్శకులు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. 2009 జూలై 31న విడుదల అయిన మగధీర అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది. అత్యధిక కేంద్రాల్లో శతదినోత్సవం, సిల్వర్ జూబ్లీ, అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డు నెలకొల్పింది. పూర్వజన్మల వృతాంతంతో, భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ తో ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించారు. మ్యూజిక్ తో కీరవాణి, కెమెరాతో సెంథిల్ మాయ చేశారు. తెలుగులో ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటి సారి. శతధృవంశ యోధుడిగా రాంచరణ్, యువరాణిగా కాజల్ చక్కగా నటించారు. రాంచరణ్ కి ఈ సినిమా స్టార్డం తీసుకొచ్చింది. మగధీర విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో మగధీర 11ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.
Here’s the beautiful video tribute to Dr.Srihari garu by @AlwaysRamCharan fans on the 11th anniversary of #Magadheera #11YearsForIHMagadheera#RamCharan #SSRajamouli pic.twitter.com/j9uaFfdt8t
— BARaju (@baraju_SuperHit) July 31, 2020
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు