telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతి రేసులోకి బంగారు బుల్లోడు…?

Allari-Naresh

టాలీవుడ్ లో ఓ హిట్ కోసం ప్రయత్నిస్తున్న చాలా మంది హీరోల్లో అల్ల‌రి న‌రేష్ ఒకడు. అయితే ఆయన రీసెంట్‌గా ‘బంగారు బుల్లోడు’ అనే చిత్రం చేశారు. పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయికగా చేస్తుంది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామెడీగా వస్తున్నా ఈ సినిమాలో న‌రేష్ బ్యాంక్ ఉద్యోగి పాత్ర‌లో క‌డుపుబ్బ న‌వ్వించ‌నున్నారు. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తిక్ సంగీతం అందించారు.  కరోనా వ‌ల‌న ఇన్నాళ్ళు థియేట‌ర్‌లోకి రాకుండా ఆగిన బంగారు బుల్లోడు చిత్రం జ‌న‌వ‌రి 2021లో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే  ఈచిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనిని బ‌ట్టి ఈ చిత్రం  ‘బ్యాంక్‌ నగల అదృశ్యం నేపథ్యంలో వినోదం, ప్రేమ, సస్పెన్స్‌, సెంటిమెంట్‌ అంశాలతో రూపొందిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. చూడాలి మరి ఈ సినిమానైనా నరేష్ ను ప్లాప్స్ నుండి బయటపడేస్తుందా… అనేది.

Related posts