telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బఫూన్‌గాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు : కేటీఆర్

KTR TRS Telangana

తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను కూడా ఉరికించి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్‌ది.. అందరి కంటే బాగా మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉంది… కానీ ఈ బఫూన్‌గాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏవేవో మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన కేటీఆర్.. కేసీఆర్ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు… గోడకు వేలాడతీసిన తుపాకీ కూ డా సైలెంట్‌గానే ఉంటుంది.. కానీ, తీసి వాడడం మొదలు పెడితే.. చీల్చి చెండాతుంది.. ఎప్పుడు వాడాలో మాకు బాగా తెలుసు అన్నారు కేటీఆర్. ఉద్యమ సమయంలో లేనివాళ్లు ఇప్పుడు ఏమేమో మాట్లాడుతున్నారు.. నిన్నమొన్న వచ్చినవాళ్లు.. ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్… దుబ్బాకలో ఏదో 500 ఓట్లతో గెలిచారు.. జీహెచ్ఎంసీలో టీఆర్‌ఎస్‌కే ఎక్కువ సీట్లు వచ్చాయి.. దీనికే బీజేపీ వాళ్లు ఇలా ఎగిరెగిరి పడితే.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాము.. ప్రతీ ఎన్నికలో గెలుస్తూ వచ్చాం.. రెండో సారి అధికారంలోకి వచ్చాం.. మరి.. మనం ఎలా ఎగిరి పడాలి? అని వ్యాఖ్యానించారు కేటీఆర్.. మన విద్యార్థులంతా వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటే.. బీజేపీ వాళ్లు మాత్రం వాట్సాప్ వర్సిటీలో చదుకుంటారని ఎద్దేవా చేసారు.

Related posts