telugu navyamedia
సినిమా వార్తలు

అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రం “భారత్”

BHarat

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్వకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్ తొలి రోజు రూ.41.50 కోట్లు రాబట్టి..తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ సినిమాగా రికార్డుల్లోకెక్కింది. గతేడాది అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ దీపావళి కానుకగా విడుదలై తొలిరోజు రూ.48.27 కోట్లు వసూలు చేసి టాప్ లో నిలిచింది. ఇక సల్మాన్ గతంలో నటించిన ‘టైగర్ జిందాహై’ తొలి రోజు రూ.34.10 కోట్లు వసూళ్లు రాబట్టగా..‘సుల్తాన్’ రూ.36.54 కోట్లు వసూలు చేసింది. బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారత్’ సల్మాన్ కెరీర్ లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

Related posts