ఇటీవల కాలంలో చాక్లెట్ బాయ్ రణ్భీర్ కపూర్, అలియా భట్ ల పెళ్ళి వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి ప్రేమాయణం సంగతి అందరికి తెలిసిందే. తాజాగా వీరిద్దరు కలిసి “బ్రహ్మాస్త్రా” అనే చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్రా చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా, ఇందులో నాగార్జున, అమితాబ్ బచ్చన్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మనాలీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ జంట సిమ్లా షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది. దాదాపు 15 రోజుల పాటు జరగనున్న సిమ్లా షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అయితే తాజాగా అలియా భట్, రణ్భీర్ కపూర్ ముంబై ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షం కాగా, రణ్బీర్ చేతి కట్టుతో కనిపించారు. ఫుట్ బాల్ ఆడుతున్న క్రమంలో రణబీర్ భుజానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో బ్రహ్మాస్త్రా చిత్ర షూటింగ్కి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ మధ్య అలియా కూడా అనారోగ్యానికి గురి కాగా, బ్రహ్మాస్త్రా మూవీ షూటింగ్ని కొద్ది రోజులు నిలిపి వేశారు.
previous post