తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ప్రతీ దర్శకుడు ఇప్పుడు తమ చూపులు బయోపిక్స్ వైపు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్, జార్జ్ రెడ్డి లాంటి బయోపిక్స్ వచ్చాయి. బయోపిక్స్లో సావిత్రి మహానటి మహానటి సంచలన విజయం సాధించింది కూడా. కమర్షియల్గా కూడా ఈ సినిమా ప్రభంజనమే. నిర్మాతలకు దాదాపు మూడింతలు లాభాలు తీసుకొచ్చింది. దాంతో పాటే నేషనల్ అవార్డు కూడా సాధించింది. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇప్పుడు ఇదే క్రమంలో చిరంజీవి బయోపిక్ కూడా వస్తుందేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్పై మనసులో మాట బయట పెట్టేసాడు మెగాస్టార్. తన జీవితంలో అలాంటి ఎమోషనల్ సీన్స్ లేవని.. డ్రామా పండించే సీన్స్ లేకపోతే బయోపిక్ పండదని చెబుతున్నాడు చిరంజీవి. ప్రస్తుతం తను ఈ క్వారంటైన్ సమయంలో జీవిత కథ రాస్తున్నట్లు ప్రకటించాడు చిరంజీవి. దాన్నే బుక్ రూపంతో పాటు డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తామంటున్నాడు మెగాస్టార్. అంతేకానీ బయోపిక్ చేసే ఆలోచన అయితే లేదని చెప్పేసాడు చిరంజీవి.