ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరిమ్ మోరానికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. దీంతో వారిద్దరు ముంబైలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరింకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ఆయన సోదరుడు మొహమ్మద్ మోరానీ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన నానావతి ఆస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఇంట్లో ఆయన భార్య, పనివారికి కూడా టెస్ట్ లు నిర్వహించారని వారందరికీ నెగెటివ్ వచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. కరిం షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రావన్, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయిర్, దిల్ వాలే లాంటి సినిమాలకు కరీమ్ మోరాని నిర్మాతగా వ్యవహరించారు.
previous post