*అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..
*ఈ ఘటనల్లో 250 మంది మరణించినట్లు సమాచారం
*భూకంపంతో కుప్పకూలిన భవనాలు..
*కొనసాగుతున్న సహాయచర్యలు
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది మరణించినట్లు ఆప్ఘన్ స్థానిక మీడియా తెలిపినట్లు వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.
అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి చాలా చోట్ల భవనాలు కుప్పకూలాయని.. శిథిలాల్లో చాలా మంది చిక్కుకొని ఉన్నారని పేర్కొన్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.