దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్కు జోడిగా అలియా భట్ నటిస్తోంది. ఈ సినిమాతో తొలిసారిగా సౌత్లో అడుగుపెడుతోంది అలియా. ఇప్పటికే ఆర్ఆర్ఆర్లో అలియా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. విభిన్న చిత్రాలతో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్న నటుడు అడివి శేష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం మేజర్లో అలియా కీలక పాత్రలో నటిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. మల్టీ లాంగ్వేజ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాలో కీలక పాత్రకు అలియాను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ మూడు సినిమాలతో బిజీగా ఉంది. బ్రహ్మస్త్ర, సడక్ 2 సినిమాల్లో నటిస్తోంది.
next post