telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో అల్లు అర్జున్, మహేష్

AA19

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ త‌న 19వ‌ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈఅల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటిస్తుండగా… సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా విడుద‌ల తేదీపై ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ఈ సినిమా విడుద‌ల గురించి ప‌లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను వ‌చ్చే ఏడాది (2020) సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నట్లు నిర్మాణ సంస్థ‌లు హారిక అండ్‌ హాసిని క్రియేష్స్‌, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతికే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు” కూడా విడుద‌ల‌వుతుంది. అంటే ఈ సారి సంక్రాంతి పోరులో ఇద్ద‌రు స్టార్స్ పోటీ ఖాయ‌మన్నమాట. అయితే సంక్రాంతికి మ‌హేశ్‌, బన్నీ పోటీ ప‌డ‌టం ఇదే తొలిసారి.

Related posts