telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్న అంపైర్…

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లో భాగంగా నిన్న మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించడంతో తిరిగి విజయ మార్గాల్లోకి వచ్చింది. చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఇక 168 పరుగుల లక్ష్య ఛేదనలో కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీ సాధించినప్పటికీ హైదరాబాద్ లక్ష్యానికి 20 పరుగులు దూరంలో ఆగిపోయింది. అయితే చెన్నై వేసిన 19వ ఓవర్లో, స్టంప్స్ వెనుక నుండి ఎంఎస్ ధోని యొక్క ప్రతిచర్య కారణంగా అంపైర్ పాల్ రీఫెల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

19 వ ఓవర్లో షార్దుల్ ఠాకూర్ రషీద్ ఖాన్ కు యార్కర్ బౌలింగ్ చేసాడు. అప్పుడు అంపైర్ దానిని వైడ్ గా ప్రకటించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. కాని అప్పుడు భారత మాజీ కెప్టెన్ ధోని కారణంగా రీఫెల్ మధ్యలో తన మనసు మార్చుకుని నిర్ణయాన్ని మిడ్ వేలో ఆపేసాడు. అప్పుడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బయట గౌండ్ లో కూర్చుని, అంపైర్ తుది నిర్ణయంతో పెద్దగా సంతోషించలేదు అన్నట్లు కనిపిస్తుంది.

 

 

Related posts