telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రతిపక్షాలపై మండిపడ్డ సజ్జల…

Sajjala ycp

ప్రతిపక్షాలపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నాల్గో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పై మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుంది అనే ఆరోపణలు వాస్తవం కాదని ఫలితాలు స్పష్టం చేశాయన్నారు.. హింసకు చోటు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రతీ  పంచాయతీని ఒక అసెంబ్లీ స్థాయిలో చూపించారు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, తన ఓటమిని అంగీకరించలేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ సజ్జల… పంచాయతీల్లో నాలుగు స్థానాలు గెలవగానే కొంత మంది చొక్కాలు చించుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు.. గ్రామ స్థాయిలో పార్టీల పాత్ర లేకుండానే పని చేసే వారిని ప్రజలు ఎన్నుకుంటారు.. మా ప్రభుత్వ పనితీరుకు ఫలితాలు అద్దం పట్టాయన్నారు సజ్జల… మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు రావడం సంతృప్తినిచ్చిందన్న ఆయన.. పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచిందన్నారు. చూడాలి మరియు దీనికి ప్రతిపక్ష నేతలు ఎలా సమాధానం ఇస్తారు అనేది.

Related posts