telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి : విజయసాయిరెడ్డి

vijayasaireddy ycp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే మూడు రాజధానులు విషయంపై ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు‌ పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది అంటూ ఎద్దేవా చేసారు విజయసాయిరెడ్డి. “అర్రె…వేలం పాటలో కొత్త థియరీ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా! ఎవరికో ఇవ్వడమేంటి! వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బాబు ఎప్పుడో కొత్త వేలం విధానాన్ని కనిపెట్టిన సంగతి నోబెల్ కమిటీ దృష్టికి వెళ్లలేదా? ఇప్పటికైనా ఆయన పేరు చేర్చి న్యాయం చేయాలి!” అంటూ ట్వీట్ చేసాడు విజయసాయిరెడ్డి.

Related posts