బిగ్ బాస్ దర్శిన్ తనను మోసం చేశాడంటూ నటి సనంశెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు దర్శిన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నటుడు దర్శిన్, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఏడాది పాటు కలిసి తిరిగామని తెలిపింది. అయితే సడన్ గా దర్శిన్ తనతో మాట్లాడడం మానేశాడని, తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పింది. ఈ విషయమై నటి సనంశెట్టి ఆ మధ్య స్థానిక ఆడయారు మహిళా పోలీస్ స్టేషన్లో దర్శిన్ పై ఫిర్యాదు చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కాగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శిన్ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్ పై కేసు నమోదు చేశారు. దర్శిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
previous post
next post