ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మూడు రోజుల క్రితం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకు డెంగ్యూ కూడా సోకిందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.
మనీశ్ బ్లడ్ ప్లేట్లెట్లు కూడా క్రమంగా పడిపోతున్నట్టు ఆయన కార్యాలయం నిన్న తెలిపింది. జ్వరంతోపాటు ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయిన స్థితిలో సిసోడియా బుధవారం ఆసుపత్రిలో చేరినట్టు ఎల్ఎన్జేపీ వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను ఎల్ఎన్జేపీ నుంచి సాకేత్లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.