ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు ప్రారంభించారు. అధికార పార్టీ ఇప్పటికే ఎంపిక ప్రారంభించింది. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో కి దిగుతున్న జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. అందులో భాగంగానే ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున తమ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాన్ ముహూర్తంగా నిర్ణయించారు.
దీంతో జనసేన నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. తొలుత కమిటీలను ప్రకటించి, వీలైనంత త్వరగా అభ్యర్తులను ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల కమీటీలకు సంబంధించిన నివేదికలు జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు జనసేనలో చేరటంతో వారికి తొలి జాబితాలోనే పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది.
నేనేమీ టీడీపీకి ద్రోహం చేయలేదు: అంబికా కృష్ణ