telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రొటోకాల్ ఉల్లంఘించారని .. డిప్యూటీ సీఎంపై రోజా ఫైర్

roja ycp mla

అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో నారాయణస్వామి పర్యటించారని రోజా అసహనం వ్యక్తం చేశారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలిసికూడా… తనను పట్టించుకోకుండా, ప్రొటోకాల్ ఉల్లంఘించారని విమర్శించారు.

వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తురులో పర్యటించారు. దళితులకు కల్యాణమంటపం స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. అయితే, ఈ కార్యక్రమానికి రోజాను పిలవకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts