కాంట్రవర్సీ యాక్ట్రెస్ అనే ముద్ర వేయించుకున్న మీరా మిధున్ ఇటీవల సూపర్స్టార్ రజినీకాంత్, ఇళయ దళపతి, హీరో సూర్య, త్రిష లపై నెపోటిజంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తమిళనాడులో బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ దృష్టి ఇప్పుడు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై పడింది. మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ అని మీరా మిథున్ ట్వీట్ చేసింది. త్వరలో తాను నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని మీరామిథున్ తెలిపారు. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
previous post