telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బషీర్ బాగ్ కాల్పుల ఘటనపై విజయసాయి ట్వీట్

vijayasaireddy ycp

హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తు చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు విమర్శలు చేశారు. మూడు రోజుల నాడు ‘వెన్నుపోటు డే’ జరుపుకున్న ఆయన నేడు ‘రక్తపాత దినోత్సవం’ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

“విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న ”వెన్నుపోటు” దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్ 28 ”చంద్రన్న రక్తపాత దినోత్సవం” జరుపుకుంటున్నారు. బషీర్‌ బాగ్ ‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో చరిత్రే చెబుతుంది బాబు” అంటూ ట్వీట్ చేశారు.

Related posts