telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ బంపర్‌ ఆఫర్‌..రఘునందన్ రావు గెలిస్తే డబల్ పింఛన్

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావులపై మరోసారి బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. సీఎంకి కలలో కూడా దుబ్బాకనే గుర్తుకు వస్తోందన్నారు. కేంద్ర నిధులపై తాను చేసిన సవాల్ కి కట్టుబడి ఉన్నానని.. దుబ్బాక చౌరస్తా లో సీఎంతో చర్చకు రెడీ అని పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, దుబ్బాక చౌరస్తాకి వస్తావా అని సవాల్‌ విసిరారు. అబద్ధాల్లో కేసీఆర్ కి ఆస్కార్ ఇవ్వాలని..ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ కి
మెడ మీద తలకాయ ఉన్నట్టా.. లేనట్టా.. అని ప్రశ్నించారు. రేపు ఫ్రంట్ ఫేజ్ లో వార్త రావాలని
హరీష్ రావు లెటర్ రాశాడని ఫైర్‌ అయ్యారు. వంద అబద్ధాలతో ముఖ్యమంత్రి కి నేను లేఖ రాస్తున్న … సిగ్గు ఉంటే సమాదానం చెప్పాలన్నారు. ఆయన పండించిన పంట ఎక్కడైనా అమ్ముకుంటాడట, రైతుల మాత్రం మార్కెట్ లో మాత్రమే అమ్ముకోవాలట… తెలంగాణ యువకుల కేసీఆర్‌ ను తరిమి కొడతారని హెచ్చరించారు.Mim చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని…మైనారిటీ లకు కొమ్ముకాస్తున్నాడు అంటూ ఫైర్‌ అయ్యారు. 80 శాతం ప్రజల కోసం మాట్లాడితే మతతత్వం అంటకడుతావా..ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తామని తెలిపారు. రామలింగారెడ్డి చనిపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. Trs అభ్యర్థి సుజాత అక్క కొడుకు ఎక్కడికి పోయాడని.. ఇంట్లో వేసి తాళం వేశారని పేర్కొన్నారు. దుబ్బాక లో గెలవాలని కేసీఆర్ కి లేదని.. కొడుక్కి అల్లుడి అడ్డంకి లేకుండా చూడాలని చూస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. రైతువేదిక లకు కూడా కేంద్రం నిధులేనన్నారు. ఏ తెలంగాణ కోసం బలిదానాలు చేశారో ఆ తెలంగాణ రాలేదని… తెలంగాణ కోసం పోరాటం చేయాలన్నారు. Trs వాళ్ల దగ్గర 10వేలు తీసుకోండని… రఘు నందన్ రావు గెలిస్తే డబల్ పింఛన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ బాధితుల తో బీజేపీ గెలిచిన వారం రోజుల్లోనే ప్రగతి భవన్ ముట్టడిస్తా అని చెప్పారు.

Related posts