ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా కాటుకు బలయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తన తండ్రి జస్టిస్ పీసీ రెడ్డి పేరుతో ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. పాలెం శ్రీకాంత్రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ యువనేత లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.