రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో బాలీవుడ్ నటి సోఫియా హయత్ చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ఉన్న రిలేషన్షిప్ గురించి సోఫియా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు సోఫియా ఆ ట్వీట్లను కొన్ని వెబ్ సైట్స్ వాళ్ళు మార్చి కథనాలు ప్రచురించారని, విరాట్ తో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని, ఇలాంటి అవాస్తవ వార్తలను నమ్మొద్దంటూ తన అభిమానులను కోరింది సోఫియా. ఇక రోహిత్ శర్మతో మాత్రం కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నానని, ఆ తరువాత విభేదాల కారణంగా విడిపోయామని, ప్రస్తుతం తమతమ జీవితాల్లో తాము బిజీగా ఉన్నామని, తమపై దయచేసి ఇలాంటి అవాస్తవపు వార్తలను ప్రచురించొద్దని కోరింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ట్వీట్లు తాను చేయలేదనతో స్పష్టం చేసింది.
previous post
next post