మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన జరిగింది. నటుడు అనిల్ మురళి (56) కన్నుమూశారు. అనారోగ్య బాధ పడుతూ కొచ్చిలో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో అనిల్ మురళి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించి మృతి చెందారు. అనిల్ మురళి మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటని నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, తోవినో థామస్ వంటి వారు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. అనిల్ మురళికి భార్య సుమ, పిల్లలు ఆదిత్యా, అరుంధతి ఉన్నారు. ముందు టెలివిజన్ రంగంలో కెరీర్ను ప్రారంభించిన అనిల్ మురళి ఆ తర్వాత సినీరంగంవైపు వచ్చారు. తను నటించిన మొదటి మలయాళ చిత్రం కన్యాకుమారిల్ ఓరు కవితస. ఇది 1993లో విడుదలైంది. మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో 150 కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 2020 ప్రారంభంలో టోవినో థామస్తో కలిసి నటించిన ‘ఫోరెన్సిక్స మూవీ అనిల్ మురళి చివరి చిత్రం.