యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్కు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నానని, తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. అర్జున్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, మేనల్లుడు ధృవ్ సర్జా, అతడి భార్య ప్రేరణా శంకర్కు కరోనా సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకోవడంతో అర్జున్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అటు బాలీవుడ్లో బిగ్ బీ ఫ్యామిలీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
previous post
బిగ్ బాస్-3 : వరుణ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు… పునర్నవి వ్యాఖ్యలు