telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ తో రొమాన్స్ కు సిద్దమైన శ్రీదేవి వారసురాలు !

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది.  ఇది ఇలా ఉండగా మహేశ్ కోసం జాన్వీ కపూర్ ను  రంగంలోకి దించబోతున్నారట. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. ఇప్పుడు వారి వారసులు కలసి సినిమాలో నటిస్తే అది తప్పకుండా సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందనే చెప్పాలి. అందుకే జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మహేశ్, త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ భావిస్తోంది. గతంలో కూడా జాన్వీని తెలుగులో నటింప చేయాలని పలువురు ప్రయత్నించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మహేశ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ భావన. బాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూనే వస్తోంది. మరి జాన్వీ తెలుగు లాంఛింగ్ లాంఛన ప్రాయం అవుతుందా? లేక గుసగుసలకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.

Related posts