telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడికి నెలకు రూ.500 కోట్లు ఎక్కడ?: దేవినేని

devineni uma disappointed on utsav arrangements

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. కరోనా కేసుల వివరాలను తెలుపుతూ పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. కరోనా నియంత్రణకు నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం..ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్న వేళ ప్రంట్ లైన్ వారియర్స్ పీపీఈ కిట్లులేక రైన్ కోట్లతో పనిచేస్తున్నారు. జీతాలురాక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు పెడుతున్న రూ  500 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ప్రజలముందుపెట్టండని డిమాండ్ చేశారు. 

Related posts