నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వరంగల్ లో ఆయన సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు స్థానిక టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహాన్ని కలిగించాయి. అరవింద్ కారుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అంతకుముందు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకులు చేతికి అప్పగించాడంటూ పరోక్షంగా ఎంఐఎం నేతలపై వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదీద్దున్ ఒవైసీని జిన్నాతో పోల్చడమేంటని నిలదీశారు.కేసీఆర్ పెద్ద కొడుకు ఒవైసీ అని పేర్కొన్నారు.