telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో పెరిగిన రద్దీ..31 కంపార్టుమెంట్లలో భక్తులు!

tirumala temple

రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శుక్రవారం నాటి దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్ల కోటా గంటల వ్యవధిలో ముగిసింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.

కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులు 20 గంటల తరువాతే దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Related posts