బాలీవుడ్ ప్రముఖులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ముంబయి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు.
రేఖ బంగ్లాకు తాళం వేశారు. కంటైన్మెంట్ జోన్ అంటూ రేఖ ఇంటి బయట బోర్డు కూడా పెట్టారు. రేఖ బంగ్లాలోని ఓ పోర్షన్ కు మాత్రమే సీల్ వేశారని ఓ అధికారి చెబుతున్నారు. ఇప్పటికే బోనీ కపూర్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ ల సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు.