వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరితో గొడవ పెట్టుకున్నా పరవాలేదని ప్రభుత్వం అనుకుంటే చెల్లదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వ్యవస్థలపై పట్టు పెంచుకోవాలేతప్ప.. శత్రుత్వం పెంచుకోకూడదని ఉండవల్లి సూచించారు.
అందరూ ఎల్వీ సుబ్రహ్మణ్యంలా ఉండరని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లూ ఉంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్లు పొమ్మంటే పోరన్నారు. వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉందన్నారు. చాలా కాలం పరిపాలన చేసినవారని అన్నారు.